తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Monday 22 June 2015

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా?

 www.onenandyala.com

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా?

స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.

తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.

అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.

ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు

2 comments:

  1. స్వామి వారికీ సమర్పణచేసే ప్రసాదాలలో బాదాం-జీడి పప్పు,ఏలక్కాయలు ,పెరుగు వంటివి వేడి ధర్మ కలిగిన వస్తువులు..అలాగే పునుగు,జవ్వాదీ,కస్తూరి వంటి అలంకరణ -అభిషేక వస్తువులో వేడిని కలిగి ఉన్నవే..ఇక నిత్య హరతులూ-అఖండంగా వెలిగే దీపం స్వామి ఉన్నచొట వేడిని వేదజల్లుతుంటాయి..ఆ ప్రదేశంనుంచి వేడి బయటకు పోయే మార్గాలు లేవు..కనుక అక్కడ ఎప్పుడూ వేడి ఉంటుంది..స్వామివారి విగ్రహం స్వేధనసశిల విభాగానికి చెందినది కావడం వలన అయన నిరంతరం తడిగా ఉంది నిజమైన ప్రాణమున్న వ్యక్తిలాగానే శేమాట కారుతున్నట్లు కనిపిస్తారు..అయన దేహ వేడిని తగ్గించడంకోసం తులసి-బిల్వం వంటి పత్రాలను అలంకరణలో వాడతారు..స్వామికి చేసే సమస్త పూ అలంకరణలూ భారీగా వేడిని జనిమ్పచేసే గుణమున్నవే..వీటిలో చామంతీ--మల్లె వంటివి అధికమైన వేడిని కలిగిఉంటాయి..స్త్రీలు మల్లెలనూ--చామంతులనూ ధరించేది అందం--సువాసనల కోసం కాదు అవి పుట్టించే వేడికి తలలోని పేలు చనిపోతాయి ..కనుక..

    ReplyDelete

దయచేసి మీ వ్యాఖ్యను తెలుగులో వ్రాయండి. ఈ బ్లాగు గురించి గానీ, వేరే బ్లాగుల గురించి గానీ, బ్లాగర్ల గురించి గానీ అనుచిత, అసందర్భ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఇక్కడ వ్రాయవద్దని మనవి.